తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!
Categories
తెలంగాణ పోటీలు

తెలుగును విషయంగా బోధించని బడులపై పిర్యాదు చేయమని పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో ఏ బడులలోనైనా (ప్రభుత్వ, ప్రయివేటు, కేంద్రీయ, అంతర్జాతీయ ఏ విధానమైనా, ఏ సిలబస్ అయినా) కచ్చితంగా తెలుగును ఒక మందలగా (సబ్జెక్టుగా) బోధించాలని చట్టం ఉన్నది.

భాగ్యనగరం లోని తెలుగును బోధించని బడుల గురించి తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) వారికి (రాధా రెడ్డి గారు, 77022 01225, director.scert-ts@nic.in) లేక విద్యామంత్రి (సబిత 040 23459922, 23322228, min_education@telangana.gov.in) గారికి పిర్యాదు చేయవచ్చు. ఆ బడి తన విధానాన్ని మార్చుకోకపోతే, చట్టప్రకారం ఆ బడికి వారు గుర్తింపును రద్దు చేస్తారు.

ఇలా పిర్యాదు చేసి ఏదైనా బడిలో తెలుగు బోధనను మొదలుపెట్టించినను, లేదా తెలుగు చెప్పని బడి గుర్తింపు రద్దు చేయించినను అలా చేయించిన వారికి తెలుగు కూటమి మెచ్చాంకును మరియు రూ. 5,000 లను కాన్కగా అందిస్తుంది.