

తెలంగాణ రాష్ట్రానికి సంబంధిచిన విషయాలు
తెలంగాణ రాష్ట్రంలో ఏ బడులలోనైనా (ప్రభుత్వ, ప్రయివేటు, కేంద్రీయ, అంతర్జాతీయ ఏ విధానమైనా, ఏ సిలబస్ అయినా) కచ్చితంగా తెలుగును ఒక మందలగా (సబ్జెక్టుగా) బోధించాలని చట్టం ఉన్నది.
భాగ్యనగరం లోని తెలుగును బోధించని బడుల గురించి తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) వారికి (రాధా రెడ్డి గారు, 77022 01225, director.scert-ts@nic.in) లేక విద్యామంత్రి (సబిత 040 23459922, 23322228, min_education@telangana.gov.in) గారికి పిర్యాదు చేయవచ్చు. ఆ బడి తన విధానాన్ని మార్చుకోకపోతే, చట్టప్రకారం ఆ బడికి వారు గుర్తింపును రద్దు చేస్తారు.
ఇలా పిర్యాదు చేసి ఏదైనా బడిలో తెలుగు బోధనను మొదలుపెట్టించినను, లేదా తెలుగు చెప్పని బడి గుర్తింపు రద్దు చేయించినను అలా చేయించిన వారికి తెలుగు కూటమి మెచ్చాంకును మరియు రూ. 5,000 లను కాన్కగా అందిస్తుంది.
తెలుగు రాష్ట్రాలలోని జిల్లా ముఖ్య పట్టణాలు, నగరాలలో కొట్లు, దుకాణాలు, కార్యాలయాల పేరుపలకలు తెలుగులో వ్రాయించడం కోసం పిలుపు. చట్టబద్ధంగా తెలుగులో ఉండాల్సినవి ఇవి. ఆయా సంస్థల యజమానులతో పేరుపలకలను తెలుగులో పెట్టించగలిగే భాషోద్యమ కార్యకర్తలకు తెలుగు కూటమి తగు పైకం, మెచ్చాంకులతో సత్కరించ తలపెట్టింది.
తెలుగు తియ్యదనం గురించి, తెలుగు వ్రాతరుల గొప్పతనం గురించి, తెలుగు వ్రాయిల గొప్పతనం గురించి మట్టుకే ఇప్పటి వరకు పాటలు వచ్చాయి. తెలుగువారు కదిలేలా, కదం తొక్కేలా మీరు పాటలు వ్రాయగలరా? పాటలు విన్నాక పాడేవారు, వినే వారు, ఆడే వారు ఇక కదిలేవారిగా మారాలి. తెలుగుతో పాటు మన సంస్కృతి, కళలు, ఆటలు, పాటలు, పండుగలు, ఎఱుక చివరకు మన జాతే కడతేరి పోతుంది అన్నది తెలియజేయాలి.
తెలుగు జనాల్ని కదిలించగలిగే తెలుగు ఉద్యమ గీతాల కోసం తెలుగు కూటమి చూస్తోంది. మీ సొంత పాటలను ఈ క్రింద సమర్పించవచ్చు. (పాట రాసే ఆసక్తి ఉన్నా కూడా మీ వివరాలను మాకు తెలియజేయండి.)
మన అమ్మనుడిని బతికించుకోడానికి మన తెలుగుకూటమి గొప్ప ముందడుగు వేస్తున్నది ఇప్పుడు.
తెలంగాణ నాట అన్ని ఊర్లల్లోని బడులవద్ద, కాలేజీల వద్ద, రెవెన్యూ ఆఫీస్ ల వద్ద గోడలపైన నినాదాలు రాయ బూనినారు.
పదిమంది మన తెలుగు అనుగరులు ఒక వ్యాన్ లో వందరోజుల పాటు ఉరూరా తిరుగుతారు. తెలుగువారితో మాట్లాడుతారు, తెలుగు కోసము పోరాడామని చెప్తారు.
మన అమ్మనుడిపై మక్కువగల తెలుగువాళ్లు అందరూ బాగా దీన్ని మెచ్చుకోవలసిందే
తెలుగు వాళ్ళు అంతా ఈ పనిని పెద్ద ఎత్తున జరిగేలా ముందుకు తీసుకెళ్లాలి.
చుక్క చుక్క కలిసి కడలి అయినట్లు మనిషి మనిషి కలిస్తేనే ఉప్పెనలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మన అమ్మనుడిని కాపాడుకోగలం.
తెలుగు వారి ఓట్లతో గెలిచినా పాలకులు తెలుగును పట్టించుకోవడం లేదు, వారిని దించాలంటే అది మనలోనే ఉంది . అందుకు అందరూ కదలండి, మన తెలుగు జాతిని లేకుండా చేసే ఏలికల పాడు బుద్ధిని ఎండగట్టండి.
మన వాట్సాప్ టెలిగ్రామ్ తెలుగుమాట జట్లలో మన తెలుగుకూటమి చేస్తున్న పనులను గమనించడమే కాకుండా మీ వంతుగా సహకారములు అందిస్తారని కోరుకుంటున్నాము.
మొదటిగా గజ్వేల్ లో గోడలపై తెలుగు నినాదాలు చూడగలరని వేడుకోలు.
వార్తలు: