తెలుగు రాష్ట్రాలలోని జిల్లా ముఖ్య పట్టణాలు, నగరాలలో కొట్లు, దుకాణాలు, కార్యాలయాల పేరుపలకలు తెలుగులో వ్రాయించడం కోసం పిలుపు. చట్టబద్ధంగా తెలుగులో ఉండాల్సినవి ఇవి. ఆయా సంస్థల యజమానులతో పేరుపలకలను తెలుగులో పెట్టించగలిగే భాషోద్యమ కార్యకర్తలకు తెలుగు కూటమి తగు పైకం, మెచ్చాంకులతో సత్కరించ తలపెట్టింది.
తెలుగు తియ్యదనం గురించి, తెలుగు వ్రాతరుల గొప్పతనం గురించి, తెలుగు వ్రాయిల గొప్పతనం గురించి మట్టుకే ఇప్పటి వరకు పాటలు వచ్చాయి. తెలుగువారు కదిలేలా, కదం తొక్కేలా మీరు పాటలు వ్రాయగలరా? పాటలు విన్నాక పాడేవారు, వినే వారు, ఆడే వారు ఇక కదిలేవారిగా మారాలి. తెలుగుతో పాటు మన సంస్కృతి, కళలు, ఆటలు, పాటలు, పండుగలు, ఎఱుక చివరకు మన జాతే కడతేరి పోతుంది అన్నది తెలియజేయాలి.
తెలుగు జనాల్ని కదిలించగలిగే తెలుగు ఉద్యమ గీతాల కోసం తెలుగు కూటమి చూస్తోంది. మీ సొంత పాటలను ఈ క్రింద సమర్పించవచ్చు. (పాట రాసే ఆసక్తి ఉన్నా కూడా మీ వివరాలను మాకు తెలియజేయండి.)
మన అమ్మనుడిని బతికించుకోడానికి మన తెలుగుకూటమి గొప్ప ముందడుగు వేస్తున్నది ఇప్పుడు.
తెలంగాణ నాట అన్ని ఊర్లల్లోని బడులవద్ద, కాలేజీల వద్ద, రెవెన్యూ ఆఫీస్ ల వద్ద గోడలపైన నినాదాలు రాయ బూనినారు.
పదిమంది మన తెలుగు అనుగరులు ఒక వ్యాన్ లో వందరోజుల పాటు ఉరూరా తిరుగుతారు. తెలుగువారితో మాట్లాడుతారు, తెలుగు కోసము పోరాడామని చెప్తారు.
మన అమ్మనుడిపై మక్కువగల తెలుగువాళ్లు అందరూ బాగా దీన్ని మెచ్చుకోవలసిందే
తెలుగు వాళ్ళు అంతా ఈ పనిని పెద్ద ఎత్తున జరిగేలా ముందుకు తీసుకెళ్లాలి.
చుక్క చుక్క కలిసి కడలి అయినట్లు మనిషి మనిషి కలిస్తేనే ఉప్పెనలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మన అమ్మనుడిని కాపాడుకోగలం.
తెలుగు వారి ఓట్లతో గెలిచినా పాలకులు తెలుగును పట్టించుకోవడం లేదు, వారిని దించాలంటే అది మనలోనే ఉంది . అందుకు అందరూ కదలండి, మన తెలుగు జాతిని లేకుండా చేసే ఏలికల పాడు బుద్ధిని ఎండగట్టండి.
మన వాట్సాప్ టెలిగ్రామ్ తెలుగుమాట జట్లలో మన తెలుగుకూటమి చేస్తున్న పనులను గమనించడమే కాకుండా మీ వంతుగా సహకారములు అందిస్తారని కోరుకుంటున్నాము.
మొదటిగా గజ్వేల్ లో గోడలపై తెలుగు నినాదాలు చూడగలరని వేడుకోలు.
తెలుగులో న్యాయ పాలన
మంగారి రాజేందర్ జింబో జిల్లా జడ్జి గా , జ్యుడీషియల్ అకాడెమి డైరెక్టర్ గా ,తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేసారు 5 కథా సంపుటాలను 4 కవితా సంపుటాలను వెలువరించారు.సాహిత్య వ్యాసాలను, లెక్కలేనన్ని లీగల్ వ్యాసాలను రాసారు , రాస్తున్నారు.
బెంగాల్లో తెలుగుకు గుర్తింపు
42% మంది తెలుగు వారు ఉన్న అరవనాట తెలుగుకు గుర్తింపు లేదు. కాని 0.1% ఉన్న బంగ రాష్ట్రంలో తెలుగుకు గుర్తింపు వచ్చింది.
ఈ విషయమై ఉద్యమకారులు కదల వలసిన తరి వచ్చినది. అరవనాడు, కర్నాటక, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో తెలుగుకు అధికార భాషగా గుర్తింపు కోసం కదలాలి.
అరవ వారు 4% ఉన్న మలేషియా, సింగపూర్, మారిషస్ లాంటి చోట్ల తమ భాషకు గుర్హింపు తెచ్చుకొన్నారు. ఆ సూత్రాన్ని అరవనాట ఎందుకు పాటించరు అని మనం గట్టిగా అడగాలి.
వార్తలు:
- పంచాయతీ ట్రైబ్యునల్ తొలి తీర్పు: ఆంధ్రజ్యోతి తీర్పును పూర్తిగా తెలుగులోనే వెలువరించడం గమనార్హం.
తెలుగు కూటమికి స్వాగతం!
తెలుగు కూటమికి స్వాగతం! తెలుగు కోసం, తెలుగు వెలుగు కోసం పోరాడే భాషాభిమానులందరికీ తెలుగు కూటమి ఒక వేదికగా పనికివస్తుందని ఆశిస్తున్నాం.